కాంగ్రెస్ నేతకు మావోయిస్టుల వార్నింగ్

by  |

దిశ,వరంగల్: జనగామ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి నిషేధిత సీపీఐ(మావోయిస్టు) నుంచి హెచ్చరికలు వచ్చాయి. ‌భూకబ్జాలు మానుకోవాలని హెచ్చరిస్తూ వెలువడిన లేఖ కలకలం రేపుతోంది. కార్యదర్శి వెంకటేశ్ రాసినట్టున్న ఈ లేఖలో.. వరంగల్ అర్బన్ జిల్లా టేకులగూడెం కేంద్రంగా పోలీసుల ప్రోద్బలంతో రాఘవరెడ్డి భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. యువతతో రౌడీయిజం చేయిస్తూ సామాన్య ప్రజలను భయాబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, రాఘవరెడ్డి భూస్వామ్య, రాజకీయ ఆదిపత్యం, రౌడీయిజానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమై పోరాడాలని లేఖలో పిలుపునిచ్చారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed