- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,వరంగల్: జనగామ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి నిషేధిత సీపీఐ(మావోయిస్టు) నుంచి హెచ్చరికలు వచ్చాయి. భూకబ్జాలు మానుకోవాలని హెచ్చరిస్తూ వెలువడిన లేఖ కలకలం రేపుతోంది. కార్యదర్శి వెంకటేశ్ రాసినట్టున్న ఈ లేఖలో.. వరంగల్ అర్బన్ జిల్లా టేకులగూడెం కేంద్రంగా పోలీసుల ప్రోద్బలంతో రాఘవరెడ్డి భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. యువతతో రౌడీయిజం చేయిస్తూ సామాన్య ప్రజలను భయాబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, రాఘవరెడ్డి భూస్వామ్య, రాజకీయ ఆదిపత్యం, రౌడీయిజానికి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకమై పోరాడాలని లేఖలో పిలుపునిచ్చారు.
Next Story