తగ్గేదెలే అంటున్న మావోయిస్టులు.. ఒకరి హత్య.. ఇద్దరి కిడ్నాప్!

by  |
తగ్గేదెలే అంటున్న మావోయిస్టులు.. ఒకరి హత్య.. ఇద్దరి కిడ్నాప్!
X

దిశ, భద్రాచలం : దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. గోర్గుండ – తోనార్ నడుమ నిర్మాణంలో ఉన్న రహదారి వద్ద పనులను పరిశీలిస్తున్న సూపర్ వైజర్‌పై దాడి చేశారు. ఆయుధాలు, విల్లంబులతో అటాక్ చేసి మట్టుబెట్టారు. అంతేకాకుండా రెండు వాహనాలకు నిప్పంటించారు. ఈ దాడిలో ఒక టిప్పర్, ట్రాక్టర్ దగ్ధమయ్యాయి. వాహనాలు తగులబెడుతుండగా అడ్డుపడిన సిబ్బందిని సైతం మావోయిస్టులు చితకబాదారు.

చివర్లో ఇద్దరు వ్యక్తులను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఈ ఘటన పోలంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చేటుచేసుకోగా, పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. ఇదిలాఉండగా బీజాపూర్ ఘటన తర్వాత మావోయిస్టులు ప్రభుత్వంలో చర్చలకు సిద్ధం అంటునే వరుస హత్యలు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.



Next Story

Most Viewed