ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

by  |
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. రెండ్రోజుల క్రితం మెటపాల్, పూస్నార్ గ్రామాలకు చెందిన 25మందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించారు. ఇదేక్రమంలో నలుగురు గ్రామస్తులను హత్య చేసి, ఐదుగురిని విడుదల చేశారు. ఇంకా 16మంది గ్రామస్తులు మావోయిస్టుల చెరలోనే ఉన్నారు. దీంతో మెటపాల్, పూస్నార్ గ్రామాల్లో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. మావోయిస్టుల నుంచి ప్రజలను విడిపించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story

Most Viewed