గిరిజనుడిని గొడ్డళ్లతో నరికేసిన మావోయిస్టులు

by  |
maoists
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్‌ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మండపల్లి మండలం కొత్తపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ సమాచారాన్ని తెలుసుకుని పోలీసులకు చేరవేస్తున్నాడనే అనుమానంతో జి. కొత్తపల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు కొర్ర పిలుకు (35) మావోయిస్టులు గొడ్డళ్లతో నరికి చంపారు. ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తే, ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా హతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.


Next Story

Most Viewed