సరిహద్దులో టెన్షన్.. బంద్‌కు మావోయిస్టుల పిలుపు

by  |
సరిహద్దులో టెన్షన్.. బంద్‌కు మావోయిస్టుల పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈ నెల 12న జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ… ఈనెల 21న మావోయిస్టులు బంద్‌కు పిలపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి పేరిట మీడియాకు ఓ లేఖను పంపించారు. ఈ నెల 12న నక్కమామిడి పంచాయతీ సింగవరం గ్రామంలో నిరాయుధులై నిద్రిస్తున్న మావోయిస్టులపై అర్ధరాత్రి పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. దీనిని తీవ్రంగా ఖండించిన మావోయిస్టులు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చారు. అత్యవసర సర్వీసులు మినహా మిగిలిన వ్యవస్థలను స్తంభింపజేసి… బంద్‌ను విజయవంతం చేయాలని పిలునిచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Next Story