ములుగులో మావోయిస్టు వాల్ పోస్టర్ల కలకలం..

by  |
ములుగులో మావోయిస్టు వాల్ పోస్టర్ల కలకలం..
X

దిశ, ములుగు : ములుగు జిల్లాలో మావోయిస్టు వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. భీమదేవర కొండ అమరవీరులకు జోహార్లు అంటూ పట్టపగలే వాల్ పోస్టర్లు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని వెంకటాపురం మండలం విజయపూరి కాలనీ గ్రామ సమీపంలోని భద్రాచలం-వెంకటాపురం జాతీయ ప్రధాన రహదారిపై ఈ మావోయిస్టు వాల్ పోస్టర్లు, లేఖలు కలకలం సృష్టించినట్టు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మావోయిస్టులు పోస్టర్లు, లేఖలు ఎవరు ఇక్కడ అంటించారనే దానిపై పోలీసులు చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు.


Next Story

Most Viewed