జర్నలిస్టులను చంపుతామని మవోల పోస్టర్

by  |
జర్నలిస్టులను చంపుతామని మవోల పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టుల గురి జర్నలిస్టులపై పడినట్లు తెలుస్తోంది. తాజాగా దంతెవాడలో మావోయిస్టులు విడుదల చేసిన తాజా పోస్టర్లు, బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. జర్నలిస్టులను చంపుతామంటూ వారు హెచ్చరికలు జారీచేశారు.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వారి పేరిట పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. దంతెవాడ జిల్లాకు చెందిన మీడియా వ్యక్తులను హతమారుస్తామంటూ సదరు పోస్టర్ల ద్వారా మావోయిస్టులు హెచ్చరించారు. ఈ పోస్టర్లు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed