టీఆర్ఎస్ సర్కార్‌పై మావోయిస్టు పార్టీ ఆగ్రహం

by  |
Maoist party
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: దళితులు, ఆదివాసీలు పోరాటాల ద్వారా సాధించుకున్న భూములను సర్వే పేరుతో భూస్వాములకు కట్టబెడుతూ గ్రామాల్లో దొరల పాలన నెలకొల్పుతున్నారని మావోయిస్టు పార్టీ మండిపడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం విధానాలపై శనివారం మావోయిస్టు పార్టీ పేరిట ప్రకటన విడుదలైంది. సెంటిమెంట్‌‌‌తో పవర్‌లోకి వచ్చిన టీఆర్ఎస్.. జనాకర్షణ పథకాలతో ప్రజలను మోసం చేస్తుందని విమర్శించింది. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో రూ. కోట్లు దోచుకుంటూ రామేశ్వరరావు, చిన్నజీయర్‌స్వామి సలహాలతో పాలన చేస్తున్నారని తెలిపింది. మావోయిస్టు ఎజెండానే మా ఎజెండా అని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి రాగానే భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ వరకూ గ్రేహాండ్స్, బలగాలతో కూంబింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తింది.

Next Story