మావోయిస్టు ద‌ళ స‌భ్యుడు భిక్ష‌ప‌తి క‌న్నుమూత‌

by  |
మావోయిస్టు ద‌ళ స‌భ్యుడు భిక్ష‌ప‌తి క‌న్నుమూత‌
X

దిశ ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్: మ‌హ‌దేవ‌పూర్, ఏటూరునాగారం ఏరియాలోని మావోయిస్టు పార్టీలో ప‌నిచేస్తున్న మేద‌రి భిక్ష‌ప‌తి ఈనెల 18న అనారోగ్యంతో మృతిచెందినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి జ‌గ‌న్ పేరిట ఒక లేఖ విడుద‌లైంది. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా చిట్యాల మండ‌లం ఓడిత‌ల గ్రామానికి చెందిన భిక్ష‌ప‌తి 2018లో మావోయిస్టు పార్టీలో చేరాడు. నాటి నుంచి ఏటూరునాగారం, మ‌హ‌దేవ‌పూర్ ఏరియా ద‌ళంలో ప‌నిచేస్తున్నాడు. ఈ క్ర‌మంలో అనారోగ్యానికి గురైన భిక్ష‌ప‌తి ఈనెల 18న మృతిచెందిన‌ట్లు పేర్కొన్నారు. స‌మాచారం అందించ‌డంలో ఆల‌స్యం జ‌రిగింద‌ని, భిక్ష‌ప‌తి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్న‌ట్లు లేఖ‌లో పేర్కొన్నారు.

Next Story