ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి

by  |
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. బీజాపూర్ ఎస్పీ కమల్ లోచన్ కశ్యప్ తెలిపిన వివరాల ప్రకారం… మావోయిస్టు నక్సల్స్ నిర్మూళనలో భాగంగా హక్వా అటవీప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టిన డీఆర్‌జీ బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు.

వెంటనే పోలీసులపై వారు కాల్పులు జరపడంతో.. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. డీఆర్‌జీ జవాన్ల కాల్పుల ధాటికి నక్సల్స్ పారిపోయారు. అనంతరం ఘటన ప్రాంతంలో ఒక నక్సల్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు మిలీషియా ప్లాటూన్ సెక్షన్ కమాండర్ అర్జున్‌గా పోలీసులు గుర్తించారు.


Next Story

Most Viewed