దంతెవాడలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి

by  |
దంతెవాడలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మరణించాడు.‌ కిరండల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బెంగ్‌పల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు.

వారు పోలీసుల మీదకు కాల్పులు జరపడంతో ఆత్మరక్షణార్థం పోలీసులు ఎదురుకాల్పులు జరిపినట్లు దంతెవాడ ఎస్‌పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. కాల్పుల విరామం తర్వాత ఆ ప్రాంతంలో పోలీసులు వెతకగా ఒక మావోయిస్టు మృతదేహం రెండు తుపాకులు, 5 కిలోల ఐఈడీ, ఇతర నక్సల్ వినియోగ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Next Story