మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతం

by  |
మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతం
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతమయ్యాడు. దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలంగనార్ అటవీ ప్రాంతంలో కట్టేకళ్యాణ్-కంగదర్ గట్టీ ఏరియా కమిటీకి చెందిన కొంతమంది మావోయిస్టులు సమావేశం అయినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు.

ఈ క్రమంలో అర్థరాత్రి సమయంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నాలుగు గంటల పాటు ఇవి చోటుచేసుకోగా.. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పీఎల్‌జీఏ ప్లాటూన్ నంబరు 26 కట్టే కల్యాణ్ ఏరియా డిప్యూటీ కమాండర్ జోగా (30) ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్పీ దీపక్‌ఝూ తెలిపారు.

Next Story

Most Viewed