భద్రాచలంలో మావోయిస్ట్ కొరియర్ అరెస్ట్..!

by Shyam |

<p>దిశ, వెబ్‎డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో మావోయిస్టు కొరియర్‎ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడి వద్ద నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలో శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో కనిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా బ్యాగులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు ఛత్తీస్‎గఢ్‎లోని బీజాపూర్ జిల్లా పుసుబాకకు చెందిన పద్దం కల్లుగా గుర్తించారు. ఈయన [&hellip;]</p>

భద్రాచలంలో మావోయిస్ట్ కొరియర్ అరెస్ట్..!
X

దిశ, వెబ్‎డెస్క్:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో మావోయిస్టు కొరియర్‎ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడి వద్ద నుంచి పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలో శుక్రవారం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో కనిపించాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా బ్యాగులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు ఛత్తీస్‎గఢ్‎లోని బీజాపూర్ జిల్లా పుసుబాకకు చెందిన పద్దం కల్లుగా గుర్తించారు. ఈయన సీపీఐ(ఎం) స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావుకు కొరియర్‎గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పాపారావు ఆదేశానుసారం కల్లు 150 డిటోనేటర్లు, రెండు లిక్విడ్ బూస్టర్లు సేకరించి నక్సల్స్‎కు చేరవేసేందుకు వెళ్తుండగా పట్టుకున్నట్లు ఏఎస్పీ రాజశేఖర్ తెలిపారు.

Next Story