మావోయిస్టుల కొత్త తరహ దాడులు

by  |
మావోయిస్టుల కొత్త తరహ దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్ : మావోయిస్టులు కొత్త తరహ దాడులకు తెరలేపారు. రహదారులకు సమీపంలో మకాం వేసి బాణాలతో విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఛత్తీస్ గఢ్‌లో మావోలు తొలిసారి కొత్త తరహా అంబుష్ దాడి చేశారు. రాజమండ్రి – జగదల్ పూర్ జాతీయ రహదారిపై ప్రయాణించే భారీ వాహనాలపై బాణం బాంబ్ తో దాడికి పాల్పడ్డారు. సుక్మా జిల్లా డోర్నపాల్ వద్ద జరిగిన ఈ దాడిలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టుల కొత్త తరహ దాడులతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.


Next Story

Most Viewed