టీఆర్ఎస్ నేతను చంపిన మావోయిస్టు అరెస్ట్

by  |
టీఆర్ఎస్ నేతను చంపిన మావోయిస్టు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 10న ములుగు జిల్లా వెంకటాపురంలో టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావు హత్య కేసులో ఓ మావోయిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాపురం మండలం కొండాపురం శివారులోని బ్రిడ్జి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. బలగాలను చూసి ఓ వ్యక్తి పారిపోతుండగా పట్టుకున్నారు. పోలీసుల విచారణలో అతనే పేరు లక్ష్మయ్య అని.. టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును చంపిన వారిలో ఉన్నట్లు ఒప్పుకున్నాడు. మూడేళ్లుగా మావోయిస్టు మిలీషియా సభ్యునిగా పనిచేస్తూ వారికి భోజన ఏర్పాట్లు, పోలీసుల కదలికలను అందించాడని తెలుస్తోంది.


Next Story

Most Viewed