‘చాలా మంది కంటి రుగ్మతలతో బాధపడుతున్నారు’

by  |
‘చాలా మంది కంటి రుగ్మతలతో బాధపడుతున్నారు’
X

దిశ ప్ర‌తినిధి ,హైద‌రాబాద్: వయస్సుతో నిమిత్తం లేకుండా చాలామంది కంటి రుగ్మతలతో బాధపడుతున్నారని,వారంతా స‌కాలంలో త‌గిన వైద్య చికిత్స‌లు పొందాల‌ని ప్ర‌ముఖ కంటి వైద్య నిపుణులు డాక్ట‌ర్ ల‌క్ష్మీప్ర‌స‌న్న అన్నారు. మ‌హాత్మా గాంధీ వ‌ర్దంతిని పుర‌స్క‌రించుకుని ఎల్బీనగర్ నియోజకవర్గం బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో శ‌నివారం ఎన్జీవోస్ కాలనీలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ… కంటి జ‌బ్బుల ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. గాయత్రి భవనం ముఖ్య సలహాదారు మంగపతి రావు మాట్లాడుతూ… బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Next Story

Most Viewed