అందులో తెలంగాణ నెంబర్ వన్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
MLA Saidireddy
X

దిశ, హుజూర్‌నగర్: సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌గా నిలిచిందని సూర్యాపేట జిల్లా హజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. జిల్లాలోని చింతలపాలెం మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే సైదిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినమాట తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అందరూ టీఆర్ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. కాగా, పార్టీలో చేరినవారిలో షేక్ ఇస్మాయిల్, మాజీ నీటి సంఘం చైర్మన్ షేక్ మౌలాలి, షేక్ నూరుల్లా, షేక్ జాను, షేక్ రాజీ, హసేన్ మహమ్మద్, రాజ్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed