MSR మృతిపట్ల సీఎం కేసీఆర్ సహా ప్రముఖుల సంతాపం

by  |
Congress senior leader Menneni Satyanarayana Rao
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి మెన్నేని సత్యనారాయణ రావు మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. అంతేగాకుండా.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్‌లు వేర్వేరుగా ఓ ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ MSR కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. ప్రభుత్వ మాజీ విప్ ఆరెపల్లి మోహన్ తన గురువును కొల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు చేయకుండా నిష్కళంగా జీవనం సాగించారని మాజీ మేయర్ డి.శంకర్ అన్నారు.

Next Story