సూర్యాపేటలో టీఆర్ఎస్‌‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో భారీ చేరికలు

by  |
TPCC Secretary Patel Ramesh Reddy
X
దిశ, సూర్యాపేట: ఉద్యోగ నియామకాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా పొట్లపాడు గ్రామంలో మాజీ సర్పంచ్ నారాయణ, సునీతా శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేశారు. వారికి పటేల్ రమేశ్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల రేట్లు భారీగా పెంచి, సామాన్యులపై భారం మోపుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ‘దళిత బంధు’ అంటూ దళితులను మోసం చేస్తున్న కేసీఆర్‌కు రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బచ్చుపల్లి నాగేశ్వరరావు, బెల్లంకొండ రాములు, మండలి పిచ్చయ్య, ఎంపీటీసీలు పవన్, నాగరాజు, నాయకులు కుందూరు వెంకట్ రెడ్డి, ఉపేందర్, దేవయ్య దామోదర్ రెడ్డి, రామ్ రెడ్డి, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed