రామగుండం సీపీపై లాయర్లు గరం గరం.. షాక్ ఇచ్చేందుకు రెడీ

by  |
రామగుండం సీపీపై లాయర్లు గరం గరం.. షాక్ ఇచ్చేందుకు రెడీ
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మంథని బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రామగుండం సీపీకి లీగల్ నోటీసులు జారీ చేసేందుకు సమాయత్తం అయింది. మంథనిలో లీగల్ ఫ్యాక్షన్ నడుస్తోందని ఆయన కొన్ని మీడియా సంస్థల్లో వ్యాఖ్యానించిట్టు గుర్తించిన బార్ అసోసియేషన్ సీపీ సత్యనారాయణకు లీగల్ నోటీసులు జారీ చేయాలని తీర్మానించారు.

హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్యకు నిరసనగా మార్చి 1 వరకు ఎలాంటి కేసులు వాదించవద్దని, విధులను బహిష్కరించాలని కూడా మంథని బార్ అసోసియేషన్ నిర్ణయించింది. వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితుల తరుఫున ఎవరూ వాదించవద్దని తీర్మానం చేశారు. కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ హై కోర్టుకు లేఖ రాయనున్నారు.



Next Story

Most Viewed