‘మన్ కీ బాత్’ ఫర్ సుశాంత్..

by  |
‘మన్ కీ బాత్’ ఫర్ సుశాంత్..
X

దిశ, వెబ్‌డెస్క్ : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి నాలుగు నెలలు కావస్తున్నా.. తనది హత్యా? లేదా ఆత్మహత్యా? అనే విషయాన్ని ఇప్పటికీ తేల్చలేదు సీబీఐ. అయితే సుశాంత్‌ది ఆత్మహత్యే అని, అతడిపై విష ప్రయోగం గానీ, ఎవరో బలవంతంగా ఉరివేయడం గానీ జరగలేదని.. శరీరంపై ఎలాంటి ఇతర గాయాలు కూడా లేవని స్పష్టం చేసింది ఏయిమ్స్. మరోవైపు తమకు సరైన న్యాయం జరగాలని, ఇది ముమ్మాటికీ హత్యేనని అంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్యాన్స్.

https://www.instagram.com/p/CGQJILelWvg/?igshid=1131lmo362z75

ఈ క్రమంలోనే సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ప్రధానమంత్రి మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వినియోగించుకుని సుశాంత్‌కు న్యాయం జరిగేలా చేద్దామని పిలుపునిచ్చింది. అక్టోబర్ 14న ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు #MannKiBaat4SSR హాష్ ట్యాగ్ యాడ్ చేసి PMO, PMOheadlines ట్యాగ్ చేస్తూ.. మీ మెసేజ్ రికార్డు చేసి ప్రధానికి సెండ్ చేయాలని కోరింది. ఈ సమయంలో అందరం కలిసికట్టుగా ఉందామని, జనం న్యాయం కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పాలని పిలుపునిచ్చింది. ప్రతీ విషయంలో సపోర్ట్‌గా ఉంటున్న సుశాంత్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది శ్వేత.



Next Story

Most Viewed