మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అస్వస్థత

by  |
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అస్వస్థత
X

దిశ, న్యూస్ బ్యూరో :

మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పితో బాధపడుతూ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరినట్టు సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఛాతిలో నొప్పి ఉందని చెప్పడంతో ఆయన్న ఈ రోజు (ఆదివారం) రాత్రి 8.45 గంటల సమయంలో ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గుండె చికిత్స అందించే వార్డులో ఆయనకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. డాక్టర్ల బృందం ఆయనకు పరీక్షలు నిర్వహిస్తోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed