నిజమైన దేశభక్తికే పట్టం..

by  |
నిజమైన దేశభక్తికే పట్టం..
X

వరుసగా మూడోసారి ఢిల్లీ ప్రజలు నిజమైన దేశభక్తికి పట్టం కట్టారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన దేశభక్తిని మేము రుజువు చేసుకోవాల్సిన పనిలేదని, ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పే తమ దేశభక్తికి అద్దం పడుతుందన్నారు.రాజకీయ నాయకులు ఎప్పుడూ ప్రజల కోసం పనిచేయాలని, వారికి ప్రాథమిక అవసరాలైన విద్యా, వైద్యం,మౌలిక వసతులు కల్పించాలన్నారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తున్నామంటే మా ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాలే అందుకు కారణమని తెలిపారు.నిబద్ధతతో పని చేసిన పార్టీలకే ఢిల్లీ ప్రజలు అండగా ఉంటారని మరోసారి రుజువైందన్నారు.మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ప్రస్తుతం ఆప్‌ 52 స్థానాల్లో, బీజేపీ 18 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతుంది.కాంగ్రెస్‌ కనీసం ఒక్క స్థానంలో కూడా ముందంజలో నిలువలేదు. అసలైన విజేతలెవరో తెలియాలంటే కౌంటింగ్ పూర్తయే వరకు వేచిచూడాల్సిందే..


Next Story

Most Viewed