మణిరత్నం షూటింగ్ షురూ?

by  |
మణిరత్నం షూటింగ్ షురూ?
X

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, త్రిష, అదితి రావు హైదరీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. కానీ, లాక్ డౌన్ కారణంగా సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఇప్పుడిప్పుడే షూటింగ్‌లు స్టార్ట్ అవుతుండగా.. మణిరత్నం కూడా ఆ సన్నాహాల్లో ఉన్నట్లు సమాచారం.

కల్కి కృష్ణమూర్తి పోన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా దృశ్య రూపం దాల్చుతుండగా.. రామోజీ ఫిల్మ్ సిటీలోనే తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ జరిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న సినిమాకు ఏ అర్ రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Next Story

Most Viewed