- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్ బ్యూరో: మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు తీసుకువచ్చిన భూసంస్కరణ చట్టాన్ని మరింత పకడ్బందిగా అమలు చేయాలని ఎమ్ఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన ఆదివారం ఓ ప్రకటన చేశారు. కులతత్వ, దొరతత్వం లేని పీవీని నేటి పాలకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చి వందల ఎకరాలను పేదలకు పంచిన సౌమ్యవాది పీవీ అని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక స్థితి మెరుగయ్యే విధంగా సంస్కరణలతో కూడా సౌమ్యవాద విధానాన్ని మరింత జోడించినప్పుడే అభివృద్ధి, ఆర్థిక అసమానతలు లేని భారత్ను నిర్మించవచ్చని తెలిపారు. పాలకులు ఆ దిశగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. అప్పుడే పీవీ నరసింహారావుకు నిజమైన నివాళులర్పించిన వాళ్లమవుతామని చెప్పారు.
Next Story