మంచు విష్ణు సంచలన నిర్ణయం.. ఇకపై వారితో మాట్లాడేది లేదని..

by  |
మంచు విష్ణు సంచలన నిర్ణయం.. ఇకపై వారితో మాట్లాడేది లేదని..
X

దిశ, వెబ్‌డెస్క్: మా ఎన్నికలు ముగిసినా.. మా సభ్యుల మధ్య వివాదాలు మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామా చేయడం, వారిపై నరేష్ తీవ్ర ఆరోపణలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన విషయం తెల్సిందే.. మరోపక్క ఇవేమి పట్టించుకోకుండా మా ప్రెసిడెంట్ గా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేయడం ఇంకా పెద్ద చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన విష్ణు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇకపై.. తాను కానీ.. తన టీమ్ కానీ.. మీడియా ముందుకు ఇంటర్వ్యూల పేరుతో వచ్చేది లేదని తేల్చి చెప్పారు. తాము చేసే పనులే మాట్లాడతాయని.. తాము మాట్లాడేది ఉండదని, ఈ విషయంలో మీడియా కూడా తమకు సహకారం అందించాలని విష్ణు కోరారు.

ఇక ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామా పై విష్ణు స్పందించాడు. “ఎన్నికల్లో మేము గెలిచాము.. వారు ఓడిపోయారు.. ఈ విషయాన్ని వారు గ్రహించాలి.. వాళ్లు రాజీనామా చేయడం దురదృష్టకరం.. అయితే మా కోసం అందర్ని కలుపుకుపోవాలి.. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు వారి సలహా కూడా తీసుకొంటామని” తెలిపారు. అయితే, మంచు విష్ణు ఈ విధంగా మాట్లాడడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో రెండు రోజుల్లో ప్రకాశ్ రాజ్ కోర్టుకు వెళితే.. విష్ణు తప్పకుండా మీడియా ముందుకు రావాలి.. అవన్నీ ఆలోచించకుండా ముందుముందే ఇలాంటి మాటలు మాట్లాడడం పద్దతి కాదని ఇండస్ట్రీలోని పెద్దలు భగ్గుమంటున్నారు.


Next Story

Most Viewed