ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై తేనెటీగల దాడి..

by  |
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై తేనెటీగల దాడి..
X

దిశ, వెబ్‌డెస్క్ : మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరి పంప్ హౌజ్ దగ్గర శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. పంప్ హౌజ్ వద్ద నీటి ఎత్తిపోతలను పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఈ దాడిలో ఎమ్మెల్యేతో పాటు పలువురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మానకొండూరు ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరగానే డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు వెల్లడించారు.

Next Story

Most Viewed