ఆమె పిలిచిందని వచ్చిన అతడు..

by  |
ఆమె పిలిచిందని వచ్చిన అతడు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: అక్రమ సంబంధంతో ఇంట్లో గొడవల నేపథ్యంలో ప్రియున్ని భర్తతో కలిసి కడతేర్చిందో ఓ మహిళ. ఈ ఘటన నిజామాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. సీఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆర్య నగర్‌లో పూరి ఉమాకాంత్, సవిత దంపతులు నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఓ కార్యాలయంలో వాచ్ మెన్‌గా ఉమాకాంత్ పనిచేస్తున్నాడు. కాగా వారి నివాసానికి దగ్గరలో ఓ అపార్ట్ మెంట్ నిర్మాణం జరుగుతోంది. అందులో నాగారం చంద్రబాబు కాలనీకి చెందిన సాల్మన్ రాజు ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటివద్ధ ఒంటరిగా ఉండే సవితతో సాల్మన్ రాజుకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ విషయంలో భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. సాల్మన్ రాజ్ ఉన్నంత వరకు గొడవలు సద్ధుమనగవని ఉమాకాంత్ భావించాడు. దీంతో సాల్మన్ రాజును చంపేయ్యాలని ఉమాకాంత్ నిర్ణయానికి వచ్చాడు. సాల్మన్ రాజుకు భార్య సవితతో ఫోన్ చేయించి తన ఇంటికి ఉమాకాంత్ రప్పించాడు. తన ఇంటికి వచ్చిన సాల్మన్ రాజు కళ్లలో అతను కారం కొట్టాడు. అనంతరం తలపై రాడ్‌తో కొట్టి అతన్ని దంపతులు హత్య చేశారు. అయితే రాత్రి 11 గంటలు అయినా సాల్మన్ రాజు ఇంటికి రాకపోయే సరికి అతని సోదరునికి అనుమానం వచ్చింది. కాగా అప్పటికే ఆర్యనగర్ వెలుతున్న విషయం తెలిసిన వారు అక్కడికి వెళ్లి చూశారు. అప్పటికే సాల్మన్ రాజు మరణించినట్టు గుర్తించి పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఉమాకాంత్, సవితలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Next Story

Most Viewed