చెవిలో హెడ్ ఫోన్స్.. ట్రాక్‌‌పై వ్యక్తి.. అంతలో రైలు

by  |
చెవిలో హెడ్ ఫోన్స్.. ట్రాక్‌‌పై వ్యక్తి.. అంతలో రైలు
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ నిల్చున్న వ్యక్తిని ఒక్కసారిగా రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఫరూక్‌నగర్ మండలం కడియాలకుంట తండా సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… రాయికల్ బురుజుగడ్డ తండాకు చెందిన మూడవత్ రాంసింగ్ డబుల్ లైన్ రైల్వే ట్రాక్‌పై ఫోన్ మాట్లాడుతూ నిలుచున్నాడు.

పాత రైల్వే ట్రాక్‌పై రైలు వస్తుందనే అనుమానంతో కొత్త రైల్వే ట్రాక్‌పై నిలుచున్నాడు. చెవిలో హెడ్ ఫోన్స్ ఉండడంతో రైలు వచ్చే శబ్దం వినిపించలేదు. దీంతో ఒక్కసారిగా రైలు వచ్చి రాంసింగ్ ను ఢీకొట్టింది. సంఘటనా స్థలంలోనే రాంసింగ్ దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story