కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

by  |
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, శేరిలింగంపల్లి: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై అహ్మద్ పాషా తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ గోపాలరాజు కాంప్లెక్స్ లో నివాసముండే బండ్ల చంద్రమోహన్ (46) 13 ఏళ్ల క్రితం మాధవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కూతురు ఉంది.

అయితే గత ఎనిమిది నెలలుగా దంపతుల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకుంటున్నాయని, ఈ నేపథ్యంలోనే గతంలో చందానగర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి ఇరువురికి నచ్చజెప్పి పంపించారు. కాగా గురువారం ఉదయం మాధవి ఎప్పటిలాగే ఆఫీసుకు వెళ్లగా ఇంట్లో తన కూతురు, తల్లీ ఉన్నారు. అయితే ఉదయం చంద్రమోహన్ ఇంట్లోని ఫ్యానుకు పంచతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన భర్త జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు


Next Story