- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, జగిత్యాల: తాను నాటిన చెట్టును నరికేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వ్యక్తి నిరసన చేశాడు. సోమవారం జగిత్యాల పట్టణంలోని ఎల్జీరామ్ లాడ్జీ వెనుక నివసిస్తున్న ప్రభాకర్ అనే వ్యక్తి రోడ్డుపై కూర్చొని నిరసనకు దిగాడు. తనకు రావాల్సిన ఆస్తి తమ సోదరులు ఇవ్వడం లేదని, అంతేగాకుండా.. తాను రెండేండ్ల క్రితం నాటిన చెట్టును, నామీద కోపంతో కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలాని చెబుతుంటే మరోవైపు నాటిన చెట్లను కొట్టేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు స్పందించి చెట్టును నరికిన రాజేశం అనే వ్యక్తికి రూ. 5 వేల జరిమానా విధించి, అదే స్థలంలో మరో మొక్క నాటించారు. దీంతో ప్రభాకర్ నిరసన విరమించారు.
Next Story