ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..

by  |
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిందో భార్య. ఈ ఘటన నిజామా బాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. నవిపేట్‌కు చెందిన జవాజీ నారాయణ, శిరీష దంపతులు నిజామాబాద్ లోని 4 వ టౌన్ పరిధిలోని సాయినగర్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఓ ప్రైవేట్ కంపెనిలో సేల్స్ మేనేజర్ కాగా పనిచేస్తున్నాడు. సిరికొండ మండలం హుస్సేన్ నగర్ కు చెందిన పణింధ్ర ప్రసాద్‌తో శిరిషకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అక్టోబర్ 26న భర్త లేని సమయంలో ప్రియుడు ఫణింద్ర ప్రసాద్ ను శిరీష తన ఇంటికి రప్పించింది. ఆ రోజు ఇంటికి నారాయణ రాగానే అతన్ని ఫణీంద్ర కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. శవాన్ని తన సోదరుడు మహేంద్ర ప్రసాద్ సహాయంతో తన బైక్ పై ఫణీంద్ర తీసుక వెళ్లాడు. నగర శివారులోని అటవీ ప్రాంతంలో ఆ శవాన్ని పారవేసి వచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. శిరీషా, ఫణీంద్ర ప్రసాద్, మహేంద్ర ప్రసాద్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story

Most Viewed