గోదావరిలో వ్యక్తి గల్లంతు.. గాలింపు చర్యలు ముమ్మరం

by  |
గోదావరిలో వ్యక్తి గల్లంతు.. గాలింపు చర్యలు ముమ్మరం
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని పినపాక మండలం భూపతిరావుపేట గ్రామపంచాయతీకి చెందిన నల్లగొండ పుల్లయ్య(55 )భూపతిరావుపేట గ్రామం చివర గోదావరి ఒడ్డున చేపలవేటకు వెళ్లి శనివారం సాయంత్రం నదిలో గల్లంతయ్యారు. అయితే శనివారం ఉప్పెనపల్లి ప్రాజెక్టు గేట్ ఎత్తివేయడంతో ఆ వరద ప్రవాహానికి పుల్లయ్య కొట్టుకొని వెళ్లాడనే పలు అనుమానాలు గ్రామస్తుల ద్వారా వ్యక్తమవున్నాయి. వెంటనే విషయం తెలుసుకున్న అధికారులు.. కోసం గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. పుల్లయ్యకు భార్య నరాయనమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.


Next Story

Most Viewed