బైక్-కారు ఢీ.. అత్తగారింటికి వెళ్లొస్తున్న అల్లుడు మృతి

by  |
Accident-alludu-died1
X

దిశ, కొందుర్గు: కారు-బైకు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొల్లూరు గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండల పరిధిలోని పర్వతాపూర్ గ్రామానికి చెందిన మరాఠీ శ్రీనివాస్ అనే వ్యక్తి అత్తగారి గ్రామం తిర్మలపూర్ కు బైక్ పై వెళ్లి వస్తుండగా కొల్లూరు గ్రామ శివారులో దేపల్లిరోడ్డు దగ్గర ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed