అతి వేగంలో కారు బీభత్సం.. వీఆర్వో మృతి

by  |
అతి వేగంలో కారు బీభత్సం.. వీఆర్వో మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : చీరాలలోని రైల్వే ఫ్లైఓవర్ బిడ్జ్‎పై ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంలో ఉన్న కారు.. బిడ్జ్‎పై మూడు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వీఆర్వోగా పని చేస్తున్న అశోక్ అనే వ్యక్తి ఘటన స్థలంలోనే మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.


Next Story

Most Viewed