నల్గొండలో పట్టపగలు వేటకొడవళ్లతో దాడి

by  |

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని ముగ్గురు దుండగులు వేటకొడవళ్లతో అతి కిరాతకంగా దాడి చేసి పరారీ అయ్యారు. స్థానిక సాగర్ రోడ్డులోని పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితుడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా ఆస్పత్రికి తరలించారు. కాగా, అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Next Story