బావను చంపిన బామ్మర్ధులు.. బంక్‌లో గంటన్నర అలా చేసి మరీ

by  |
బావను చంపిన బామ్మర్ధులు.. బంక్‌లో గంటన్నర అలా చేసి మరీ
X

దిశ, ఆత్మకూరు, చివ్వెంల : కుటుంబ తగాదాల‌తో సొంత బావను బామ్మర్దులు కొట్టి చంపిన సంఘటన మండలం పరిధిలో‌ని నెమ్మికల్ సమీపంలో ఎస్సార్ పెట్రోల్ బంక్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. బంక్‌లో పనిచేస్తున్న జాదవ్ బాలకృష్ణ 35 పై ఇద్దరు బామ్మర్దులు వారి స్నేహితుడితో కలసి తీవ్రంగా దాడి చేయడం‌తో అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాలప్రకారం.. సూర్యాపేట ఇందిరమ్మ కాలనీ‌కి చెందిన మృతుడు జాదవ్ బాలకృష్ణ 2013లో చివేంల మండలం ఐలపురానికి చెందిన జలజ‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికిద్దరు పిల్లలు. గత ఏడాది కాలంగా భార్య భర్తల మధ్య వివాదం ఏర్పడి భార్య జలజ పుట్టింటికి వెళ్ళింది. తరుచు ఫోన్‌లో తిట్టుకుంటూ ఘర్షణ పడుతుండేవారు. శనివారం రాత్రి మృతుడు బాలకృష్ణ బామ్మర్దులు మేడెబోయిన అంజయ్య మహేష్‌లువారి స్నేహితుడు కేశబోయిన లింగయ్యతో కలిసి నెమ్మికల్‌లో బంక్‌లో పనిచేస్తున్న బాలకృష్ణ వద్దకు వచ్చి ఘర్షణ పడ్డారు. బాలకృష్ణతో పాటు పని చేస్తున్న మరో ఇద్దరు ఉన్నప్పటికీ కత్తులతో బెదిరించి బాలకృష్ణ పై దాడి చేశారు. ఈ దాడి‌లో బాలకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. బంక్ మేనేజర్ పోలీస్‌ల‌కు ఫోన్ చేయడం‌తో పోలీస్‌లు వచ్చి మృతదేహాన్ని సూర్యాపేట హాస్పిటల్ పోస్ట్ మార్టమ్‌కు పంపారు. ఆదివారం ఉదయం మృతుని తల్లి జాదవ్ సుశీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్ ఐ సురేష్ రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed