చెన్నారం చెరువుకు గండి.. వ్యక్తి గల్లంతు

by  |
చెన్నారం చెరువుకు గండి.. వ్యక్తి గల్లంతు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు కట్టలు తెంచుకుంటున్నాయి. ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరిగడంతో, ఎక్కడికక్కడ గేట్లు ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలో నారాయణపేట్ జిల్లా కోస్గి మండలం చెన్నారం చెరువుకు గండి పడింది. సోమవారం దానికి పూడ్చడానికి గ్రామానికి చెందిన బీమప్ప అనే వ్యక్తి అందులోకి దిగి, గల్లంతు అయ్యాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు బీమప్ప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed