పంజా విసిరిన మ్యాన్ ఈటర్.. ఎద్దు మృతి

by  |
పంజా విసిరిన మ్యాన్ ఈటర్.. ఎద్దు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆసిఫాబాద్ జిల్లాలో మ్యాన్ ఈటర్ పులి మళ్లీ తిరిగొచ్చింది. ఇన్ని రోజులు పులి సంచారం కనిపించకపోవడంతో గ్రామస్తులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే పశువుల మందపై మ్యాన్ ఈటర్ మరోసారి పంజా విసిరింది. గుండెపల్లిలో పశువుల మందపై ఒక్కసారి దాడి చేసిన పులి ఎద్దును చంపేసింది.

ఈ విషయాన్ని కాపరి గ్రామస్తులకు వెల్లడించగా, వారు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది మ్యాన్ ఈటర్ కోసం సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీచేశారు.

Next Story