బ్లాక్ ఫంగస్ టెర్రర్.. కామారెడ్డి జిల్లా వ్యక్తి మృతి

by  |
బ్లాక్ ఫంగస్ టెర్రర్.. కామారెడ్డి జిల్లా వ్యక్తి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే పదుల సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా.. ఫంగస్ సోకిన వారు మత్యువాతపడుతున్నారు. తాజాగా బ్లాక్ ఫంగస్‌తో చికిత్స పొందుతూ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్దవాసి ప్రాంతానికి చెందిన అంజల్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు సమాచారం. ఈ ఫంగస్ సోకి తెలంగాణలోని పలు ఆసుపత్రుల్లో బాధుతులు చికిత్స పొందుతున్నారు.

Next Story

Most Viewed