విషాదం.. పెద్దపల్లి జిల్లాలో బ్లాక్ ఫంగస్‌ కలకలం

by  |
విషాదం.. పెద్దపల్లి జిల్లాలో బ్లాక్ ఫంగస్‌ కలకలం
X

దిశ, వెల్గటూర్ : పెద్దపెల్లి జిల్లాలోని ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బొల్లి రాజమల్లయ్య (45) బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మారం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బొల్లి రాజమల్లయ్య ధర్మారం మండల కేంద్రంలో చేపల దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు.

కాగా అతడికి జూలై నెలలో కరోనా సోకగా కోలుకున్నాడు. అనంతరం బ్లాక్ ఫంగస్ సోకడంతో కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, బ్లాక్ ఫంగస్‌తో అతని ఎడమ కన్ను కోల్పోయాడు. గత 15 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజమల్లయ్య శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు.



Next Story

Most Viewed