ఎడ్లబండిని బైక్ ఢీ కొని వ్యక్తి మృతి

by  |
ఎడ్లబండిని బైక్ ఢీ కొని వ్యక్తి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎడ్లబండిని బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం తెల్లవారు జామున జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. ధర్మపురికి చెందిన చంద్రయ్య అనే వ్యక్తి, కోరుట్లలో బీడీ ప్యాకింగ్‌ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఈ రోజు ఉదయం విధులకు వెళ్తూ.. ధర్మపురిలో ఓ బైక్‌ను లిఫ్ట్‌ అడిగాడు. ఓ వ్యక్తి లిఫ్ట్ ఇవ్వడంతో బైక్‌పై కోరుట్ల వెళ్తుండగా నేరెళ్ల సమీపంలో బైకు, ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని ఢీకొట్టింది. దీంతో వెనక కూర్చున్న చంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌ నడుపుతున్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed