ఎడ్లను కడగటానికి చెరువులోకి దిగి..

by  |
ఎడ్లను కడగటానికి చెరువులోకి దిగి..
X

దిశ తుంగతుర్తి: సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి చెరువులో పడి మృతి చెందాడు. మద్దిరాల మండలం పోలుమల్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు బురద పొలంలో గొర్రు కట్టి తిరిగి వస్తూ ఎడ్లను కడగటానికి చెరువుకు తీసుకెళ్లాడు. ప్రమాదవశాత్తు అతను చెరువులో మునిగిపోయాడు. స్థానికులు గమనించి రక్షించడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. రైతు కోసం చెరువులో గాలించగా.. గంట తరువాత మృతదేహం లభ్యమైంది.

Next Story

Most Viewed