మునుగోడులో కరోనాతో వ్యక్తి మృతి

by  |
మునుగోడులో కరోనాతో వ్యక్తి మృతి
X

దిశ, మునుగోడు: నల్గొండ జిల్లాలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఈ ఘటన మునుగోడు మండలం కిష్టాపురం‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గత మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చికిత్స నిమిత్తం నల్గొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్న బాధితుడు గురువారం మృతి చెందాడు.

దీంతో మృతుడిని ఆంబులెన్స్‌లో స్వగ్రామం కిష్టాపురానికి తరలించి తన వ్యవసాయ భూమిలో వైద్య సిబ్బంది ఖననం చేశారు. తాజాగా గురువారం మునుగోడు మండల కేంద్రంలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి ధృవీకరించారు.



Next Story