కారును ఢీకొన్న డీసీఎం వ్యాన్: ఒకరు మృతి

by  |
కారును ఢీకొన్న డీసీఎం వ్యాన్:  ఒకరు మృతి
X

దిశ, నల్లగొండ: తండ్రి చనిపోయాడన్న దుఖంలో ఉన్న ఓ కుటుంబంలో అంతలోనే మరో విషాదం చోటుచేసుకుంది. 10 నిమిషాల్లో స్వగ్రామానికి చేరేలోపే డీసీఎం రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వేగంగా వస్తూ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడాదిన్నర బాలుడు చనిపోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బండమీది చందుపట్ల వద్ద చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. మోతె మండలం రాంపురంతండాకు చెందిన భూక్య భిక్షం ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. అతని తండ్రి భూక్య బింగ్య(80) స్వగ్రామం రాంపురంతండాలో బుధవారం అనారోగ్యంతో చనిపోయాడు. తండ్రి అంత్యక్రియల కోసం హైదరాబాద్‌ నుంచి కారులో బయలుదేరారు. వాహనాలు అందుబాటులో లేకపోవడంతో నలుగురు పట్టే కారులో భిక్షం, ఆయన ఇద్దరు భార్యలు, కొడుకు కోడలు, కూతురు, అల్లుడు, వారి పిల్లలతో స్వగ్రామానికి బయలుదేరారు. బండమీది చందుపట్ల వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును డీసీఎం వాహనం ఢీకొట్టింది. క్షతగాత్రులను సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.

Tags: road accident, suryapet, one dead, car, dcm, ts news



Next Story