- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మంగళవారం ఉదయం కలకలం రేగింది. ఓ వ్యక్తి ఆసుపత్రి బిల్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని గంటపాటు హల్ చల్ చేశాడు. భార్యాభర్తల మధ్య చెలరేగిన గొడవ కారణంగానే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ కానిస్టేబుల్… అతనిని కిందకి దిగొచ్చేలా చేశాడు.
వివరాల్లోకి వెళితే… మంచిర్యాలలోని హమాలివాడకు చెందిన పసుపులేటి శేఖర్ కు తన భార్యకు మధ్య మనస్పర్థలు చెలరేగాయి. ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో తనకు పోలీసుల సహకారం కావాలంటూ డిమాండ్ చేసిన శేఖర్… మంచిర్యాలలోని ప్రభుత్వాసుపత్రి భవనంపైకి ఎక్కి వీరంగం సృష్టించాడు. పోలీసులు తనకే సహకరిస్తానని హామీ ఇవ్వాలని, లేదంటే బిల్డింగ్ పైనుండి దూకి చచ్చిపోతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
అదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ భూపతి రెడ్డి… అతను ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా రక్షించాడు. నీ భార్య నాతో ఫోన్ లో మాట్లాడుతుంది, నీతో మాట్లాడతానంటుంది అని చెబుతూ… మాటల్లో పెట్టి అతన్ని టక్కున కిందకి లాగేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఎస్ఐ ప్రవీణ్.. శేఖర్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.