పిల్లలు పుట్టడం లేదని భార్యకు చెప్పకుండా.. పక్కింట్లో భర్త..!

by  |
పిల్లలు పుట్టడం లేదని భార్యకు చెప్పకుండా.. పక్కింట్లో భర్త..!
X

దిశ, కూకట్‌పల్లి: పెండ్లై ఏడు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టడం లేదని.. భార్యను ఒంటరి చేశాడు ఓ భర్త. ఈ ఘటన కేపీహెచ్‌బీ కాలనీలో వెలుగుచూసింది. పూర్తి వివరాళ్లోకి వెళితే.. వసంత్‌నగర్‌ ఫ్లాట్‌ నెంబర్‌ 214లో రాహుల్ (34) రమ్య భార్య భర్తలు నివాసం ఉంటున్నారు. పెండ్లై 7 ఏండ్లు గడిచినా వీరికి సంతానం కలుగలేదు. భార్యభర్తలిద్దరూ పిల్లలు లేరన్న బాధతో నిత్యం కుమిలిపోయేవారు. ముఖ్యంగా రాహుల్‌ ఎక్కువగా సఫర్ అయ్యేవాడు.

ఈ నేపథ్యంలోనే సోమవారం సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లి రమ్మని భార్య సూచించగా.. ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాహుల్ ఎంతకీ తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన రమ్య భర్త కోసం వెతుకులాట ప్రారంభించినా ఆచూకీ లభించలేదు. సోమవారం రాత్రి ఇంట్లోనే పడిగాపులు కాస్తూ భర్త కోసం ఎదురుచూడసాగింది. ఇదే సమయంలో తెల్లవారింది కూడా. సరిగ్గా ఇదే సమయంలో రమ్యకు పక్కింట్లో నుంచి ఏదో సౌండ్ వినిపించింది. వెంటనే ఆ డోర్ వద్దకు వెళ్లగానే తన భర్త ఫోన్ అలారం సౌండ్ రావడంతో బిక్కు బిక్కు మనుకుంటూ లోపలికి వెళ్లగా.. భర్త విగతాజీవిగా కనిపించాడు. అదే ఇంట్లో కిచెన్‌లో అమర్చిన సీలింగ్‌ ఫ్యాన్‌కు ఊరేసుకున్నాడు. పిల్లలు పుట్టడం లేదని ఆత్మహత్య చేసుకున్న భర్తను చూసి భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.



Next Story

Most Viewed