- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో ఓ గుర్తుతెలియని వ్యక్తి (55) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. అఫ్జల్ గంజ్ ఇన్ స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఆస్పత్రి వర్గాల కథనం ప్రకారం.. ఉస్మానియా ఆసుపత్రిలోని కూలికుతుబ్ షా భవనం రెండవ అంతస్తులో ఉన్న వార్డులో శ్లాబుకు ఉన్న కొక్కానికి టవల్తో ఉరేసుకుని మృతి చెందిన వ్యక్తిని బుధవారం తెల్లవారు జామున సిబ్బంది గమనించి ఆస్పత్రి అధికారులతో పాటు అఫ్జల్ గంజ్ పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతుని గురించి ఆరా తీయగా.. ఎటువంటి సమాచారం లభించలేదు. రోగులు కూడా అతనిని గుర్తించకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. హాస్సిటల్ మెయిన్ గేట్ వద్ద ఉన్న రెండు సీసీ కెమెరాలను పరిశీలించగా.. అందులో ఒకటి పని చేయడం లేదు. రెండవ దానిలో మృతుని ఆనవాళ్లు లభించలేదని పోలీసులు తెలిపారు.
- Tags
- sucide