ఎస్పీ ఆఫీస్ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం

by  |
ఎస్పీ ఆఫీస్ ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం
X

దిశ, ఏపీ బ్యూరో: పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఎస్పీ కార్యాలయం ఎదుటే ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. రాజమండ్రి రూరల్​ మండలం బొమ్మూరుకు చెందిన షేక్​ సత్తార్ ​కుమార్తెపై అత్యాచారయత్నం జరిగింది. జూలై 26న నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వైసీపీ నేతల అండతో కేసు వాపస్ ​తీసుకోవాలని నిందితులు ఒత్తిడి చేస్తున్నారు. ఇదే క్రమంలో తరచూ పోలీసులు స్టేషన్‌కు పిలుస్తుండటంతో విసిగిపోయిన సత్తార్​… ఈనెల 1న రాత్రి రాజమండ్రి అర్బన్​ ఎస్పీ ఆఫీస్ వద్ద పురుగుల మందు తాగాడు.

ఈ ఘటనపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, గుంటూరుకు చెందిన మహ్మద్ నజీర్, మైనార్టీ కార్పొరేషన్​ మాజీ చైర్మన్​ ఎండీ హిదాయత్​, పార్టీ రాష్ర్ట కార్యదర్శి మహ్మద్​ నజీర్ ​సోమవారం బాధిత కుటుంబాన్ని కలవనున్నారు. అసలేం జరిగిదందనే వివరాలతో కూడిన నివేదికను చంద్రబాబుకు నివేదిస్తారు.



Next Story

Most Viewed