మద్యం మత్తులో నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్య….

by  |
dead body
X

దిశ, పటాన్ చెరు: మద్యం మత్తులో ఒంటికి నిప్పంటించుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మృతుడు చిన్న కంచర్ల గ్రామానికి చెందిన పూజారి నాగరాజు (28) కూలిపని చేస్తూ తన భార్య శ్రీలత, ఇద్దరు కుమారులు చైతన్య, దీక్షిత్ లతో ఉంటున్నాడు. మృతుడుకి మద్యం తాగే అలవాటు ఉంది. అలాగే అతనికి ఫిట్స్ వ్యాధి కూడా ఉంది. ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నాగరాజు తాగి బైక్ పై నుంచి కిందపడి గాయాలతో ఇంటికి రావడంతో, భార్య శ్రీలత అతనికి మందులు ఇచ్చి పడుకో పెట్టింది.

అనంతరం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో నాగరాజు బయటకి వెళ్లి తాగిన మైకంలో తనకు తానుగా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని అరుస్తూ ఉండగా గమనించిన అతని భార్య శ్రీలత, అమ్మ చుక్కమ్మలు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. కానీ అంబులెన్స్ వచ్చేలోపే కాలిన గాయాలతో నాగరాజు మరణించాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై టి.మల్లయ్య వెల్లడించారు.

Next Story

Most Viewed